తెలుగు సాహిత్యచరిత్రను పరిశీలించినా కూడా, తెలుగు నేల రాజకీయంగా అస్థిరత్వం నెలకొన్నప్పుడల్లా యక్షగానం ముందుకొస్తూండటం కనిపిస్తుంది. ఆ అపురూపమైన కళా ప్రక్రియ గురించి తెలుసుకోకపోవడం వల్లా, అందులో రచనలు చేయకపోవడం వల్లా నష్టపోయింది ఆధునిక తెలుగు కవులేనని మరో మారు అర్థమయింది.
త్యాగయ్య ఒక కవి కూడా
సంగీతప్రియులు రాసిన ఈ వ్యాసాలు సాహిత్యప్రియుల్ని కూడా ఆలరింప చేస్తాయి గాని, అన్నిటికన్నా ముందు త్యాగయ్య ఒక కవి అని సాహిత్య ప్రేమికులు కూడా గుర్తుచేసుకోవలసి ఉంటుందని ఈ ప్రత్యేక సంచిక మరీ మరీ హెచ్చరిస్తోంది