ఇన్నాళ్ళకు కోసక్కులు చదివేక నాకు అర్థమయిందేమంటే, తనలోని ఈ విముక్తి అవసరాన్ని ఆయన కాకసస్ లోని తొలిరోజుల్లోనే గుర్తుపట్టాడని. పూర్వరచయితల్లాగా ఆ ప్రకృతిని ఒక సుందరసీమగా మాత్రమే ఆయన చూడలేకపోయాడు. అక్కడ స్వతంత్రంగా జీవించే మనుషులున్నారనీ, నువ్వు నిజంగా ఆ సీమని ప్రేమిస్తే, నువ్వు చెయ్యవలసింది ముందు వాళ్ళల్లో ఒకడివి కావడమేననీ ఆయన గుర్తుపట్టాడు.
బయటపడాలి
ముఖ్యంగా నువ్వు నీ తోటి మనిషిని నీ ప్రయత్నాల్లో ఒక భాగంగా స్వీకరిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక రూపంలో అతణ్ణి నియంత్రించడానికి పూనుకుంటావన్న ఎరుక కలగగానే అది నిన్ను పెట్టే ఆత్మ హింస సాధారణంగా ఉండదు.
ఆషాఢమేఘం-11
ముల్లైప్పాట్టు ఒక సాధారణ ప్రణయ కవిత స్థాయి నుంచి ఒక శుభాకాంక్షగా మన కళ్ళముందు ఎదిగిపోతుంది. మేఘసందేశంలో కాళిదాసు ప్రణయవార్తకీ, శుభాకాంక్షకీ మధ్య సరిహద్దుని చెరిపేసాడని టాగోర్ అంటున్నప్పుడు, కాళిదాసుకన్నా ఎంతో కాలానికి పూర్వమే ఒక ప్రాచీన తమిళ కవి ఆ పని చేసాడని ఆయనకు తెలీదు!