నాకు అప్పుడు బడి అంటే భవనమనీ, సదుపాయాలనీ ఆలోచన లేదనిపిస్తుంది. బడి అంటే మా వజ్రమ్మ పంతులమ్మగారు. అంతే. ఆమెని చూసే చింగిజ్ అయిత్ మాతొవ్ 'తొలి ఉపాధ్యాయుడు' పుస్తకం రాసి ఉంటాడు. ఆమె నేను చూసిన పరిపూర్ణ క్రైస్తవురాలు. కాని నాకు రామాయణం, మహాభారతం చెప్పిన తొలి గురువు కూడా ఆమెనే.
మల్లు వెళ్ళిపోయాడు
మల్లు ఇట్లా అర్థాంతరంగా వెళ్ళిపోయాడని తెలియకుండానే మా అమ్మానాన్నా వెళ్ళిపోవడం ఎంత మంచిదైంది. వాళ్ళకి గుండె పగిలిపోయుండేది, ఈ వార్త వింటే, మా అమ్మకి మరీ ముఖ్యంగా.
మా అమ్మ మనసు, మా భద్రం మనసు, మల్లు మనసు ఒక్కలాంటివనిపిస్తుంది. వాళ్ళ ఒంట్లో రక్తం కాదు, గంగాజలం ప్రసరిస్తూంటుంది.
గ్రంథాలయాల నీడన
ఆధునిక అంధ్రదేశ చరిత్రలో సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా గొప్ప విప్లవాత్మక పాత్ర పోషించిన గ్రంథాలయోద్యమ కేంద్రం అది. మా మాష్టారు హీరాలాల్ గారు ఒక సారి ఒక మాటన్నారు: 'ఆంధ్రదేశంలో జాతీయోద్యమమంటే గ్రంథాలయోద్యమమే' అని