తాను శివశరణుల తొత్తుననీ, లెంకననీ బసవణ్ణ తన కవిత్వంలో పదే పదే చెప్పుకున్నాడు. అటువంటి కవిత్వం చదువుతున్నప్పుడు మనలో ఒక వైపు అటువంటి మహామానవుడు మేల్కొంటూ మనలోని లఘుమానవుడు అణగిపోతూ ఉండటం మనకి అనుభవానికొస్తుంది.
ఒక్కడూ కనబడలేదు
ఇన్నేళ్ళ నా అభిప్రాయాన్ని పరాస్తం చేసేసారు సుష్మ. కబీర్ దోహాలకి నా వచన అనువాదాల్ని ఆమె ట్యూన్ చేసి నాకు పంపించినప్పుడు నన్ను సంభ్రమం ముంచెత్తింది. ఎలా అయితే, అనువాదాన్ని దాటి కూడా కవిత్వం ప్రవహించగలదో, అనువాదాన్ని దాటి సంగీతం కూడా ప్రవహించగలదని ఇప్పుడు నాకు అర్థమయింది.
ఆషాఢమేఘం-30
రామాయణ వర్షాన్ని భాగవత వర్షంతో పోలిస్తే వెయ్యేళ్ళ కాలంలో భారతీయ దృక్పథంలో ఎటువంటి మార్పు వచ్చిందో మనకి తేటతెల్లంగా తెలుస్తూ ఉంది. తత్పూర్వ కవిత్వాలు ఇంద్రియతాపాన్ని రగిలించేవిగా ఉండగా, భాగవత వర్షం ఇంద్రియతాపాన్ని శంపింపచెయ్యడం మీదనే దృష్టిపెట్టిందని మనకి సులభంగానే బోధపడుతుంది.
