బసవ పురాణం-2

పాల్కురికి సోమన రాసిన బసవపురాణంలో ముగ్ధ భక్తుల గురించిన ప్రసంగాల్లో రెండవ రోజు ప్రసంగం బెజ్జమహాదేవి గురించి. వాత్సల్య భక్తికి ఉదాహరణగా కృష్ణ భక్తి సాహిత్యంలో ఒక పెరియాళ్వారు, ఒక సూరదాసు మనకు కనబడతారు. కానీ ఒక తల్లి హృదయంతో శివుని పసిబిడ్డగా భావించి లాలించి పెంచుకున్న ఒక ముగ్ధ మాతృమూర్తి కథ ఇది. భారతీయ భక్తి సాహిత్యం లోనే ఇటువంటి కథ మరొకటి లేదు.

ఆషాఢమేఘం-1

ఆషాఢ మేఘం ఒక సూచన, ఒక ధ్వని. ఏకకాలంలో భూమీ, ఆకాశమూ కలుసుకునే చోటు అది. భావుకుడైన ప్రతి మానవుణ్ణీ ఈ ప్రపంచమూ, మరో ప్రపంచమూ రెండూ ఒక్కసారే పిలుస్తున్నప్పుడు అతడు లోనయ్యే ఉద్విగ్నతకు అద్దం పట్టే దృశ్యమది.

శ్రీపర్వతప్రకరణం

అది తెలుగులో మొదటి యాత్రాకథనం. రామాయణ, మహాభారతాల్ని వదిలిపెడితే, భారతీయ భాషాసాహిత్యాల్లో అటువంటి తీర్థయాత్ర కథనం మరొకటి కనిపించదు. అది తెలుగు కథనం మాత్రమే కాదు, అందులో గీర్వాణ, కర్ణాట, తమిళ, మహారాష్ట్ర దేశాల భక్తుల కీర్తనలు కూడా ఉన్నందువల్ల భారతీయ సాహిత్యంలోనే మొదటి బహుభాషా యాత్రాకథనం కూడా.

Exit mobile version
%%footer%%