రమణా సుమనశ్రీ అవార్డు

26 సాయంకాలం గోల్డెన్ త్రెషోల్డ్ ప్రాంగణంలో ప్రసిద్ధ కవి, ఆత్మీయమిత్రుడు సుమనశ్రీ కె.శివారెడ్డి ఇటీవలి కవితాసంపుటి 'గాథ ' కీ, నా కవితా సంపుటం 'నీటిరంగుల చిత్రం ' కీ రమణా సుమనశ్రీ అవార్డులు అందించాడు.  ఆ సత్కార సమావేశానికి మరొక ప్రసిద్ధ కవి, భావుకుడు దీవి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు.

ఒంటరి

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారి గురించి విన్నానుగాని, ఒకటి రెండు కథలు మినహా, ఆయన రచనలేమీ నేను చదవలేదు. ఇప్పుడు తానా నవలలపోటీలో బహుమతి పొందిన ఆయన నవల 'ఒంటరి' చదువుదామనుకుంటూ ఉండగానే మిత్రులు గజేంద్రనాథ్ గారు హన్స్ ఇండియాలో తాను రాసిన వ్యాసం ఒకటి నాకు పంపించారు.

భారతీయనవలాదర్శనం

ఈ మధ్య కొన్నాళ్ళుగా మిత్రులు తమకి ఇష్టమైన పుస్తకాల్ని వరసగా మిత్రులతో పంచుకుంటూ ఉన్నారు. మామూలుగా ఆస్తులు, డిగ్రీలు, హోదాలు, నగలు, చీరలు, ఫర్నిచరు ప్రదర్శించుకోడానికి ఇష్టపడే ఈ ప్రపంచంలో ఇట్లా తమకిష్టమైన పుస్తకాల్ని ప్రదర్శించుకుంటున్న మిత్రులు తామున్న మేరకి ఈ ప్రపంచాన్ని మరింత శోభాయమానంగానూ, ప్రేమాస్పదంగానూ చేస్తూ 'నువ్వు చదివే పుస్తకాలేవో చెప్పు , నీ మిత్రులెవరో చెప్తాను' అనే పాత మాటని 'నీ మిత్రులెవరో చెప్పు, నువ్వు చదివే పుస్తకాలేవో చెప్తాను' అంటో తిరగరాస్తున్నారు.

Exit mobile version
%%footer%%