మేము ఆ ఊరు వెళ్తామని తెలిసి సోమశేఖర్ తాను కూడా వస్తానన్నాడు. రావడమే కాదు, తనే తన కారుమీద మమ్మల్ని ఆ ఊరు తీసుకువెళ్ళి తీసుకొచ్చాడు. ఆ రోజు అతడు కూడా ఆ గిరిజనదేవతను దర్శించుకున్నాడు. కాని అతడి హృదయంలో ఇన్ని రసతరంగాలు ఎగిసిపడుతున్నాయని నేను ఊహించలేకపోయాను.
మందం మందం మధుర నినదైః
ఏమా అని తెరిచి చూద్దును కదా, గోదావరి గళం నుంచి ప్రవహిస్తున్నట్టు, మాష్టారి కంఠస్వరంలో కృష్ణకర్ణామృత శ్లోకాలు. అలానే వింటూ ఉండిపోయాను. సాయంకాల ప్రార్థన పూర్తయిందనిపించింది.
నా భిక్షాపాత్ర నిండింది
ఈసారి కూడా అలాగే మరో వంద డాలర్ల మేరకు పుస్తకాలు తెస్తానంటే కాదన లేకపోయాను. అందుకని, ఇదుగో, ఈ పుస్తకాలు తెప్పించుకున్నాను. పుస్తకాల కోసమైతే నా భిక్షాపాత్ర ఎత్తిపట్టుకోడానికి నాకెప్పటికీ సంతోషమే.
