పుస్తక పరిచయం-51

పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు అవధూత గీత పైన ప్రసంగిమను. దత్తాత్రేయులు రాసారని భావించే ఈ గీత, భారతీయ తాత్త్విక సాహిత్యంలో, అత్యుత్తమ కృతుల్లో ఒకటి. స్థితప్రజ్ఞుడు ఏం మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు, దేని వల్ల నిలబడగలుగుతాడు అన్నదానికి భగవద్గీత ఒక వివరణ అయితే, విముక్తమానవుడు ఎలా ఉంటాడు, ఎలా భావిస్తాడు, ఎలా మాట్లాడతాడు అన్నదానికి అవధూత గీత ఒక నిరూపణ. ఈ పుస్తకం మీద నా ప్రసంగం ఇక్కడ వినవచ్చు.