ఒక మనిషి తాత్త్వికంగా సత్యాన్వేషణకు పూనుకోవడమంటే 'నీరస తథ్యాల్ని' తిరస్కరించడం. 'నిశ్చల నిశ్చితాల' ని పక్కకు నెట్టేయడం. కాబట్టే, సత్యాన్వేషణ అన్ని వేళలా సంతోషానికీ, మనశ్శాంతికీ దారితియ్యకపోగా, నిరంతర ఆత్మశోధనకీ, సంశయగ్రస్తతకీ, ఆత్మవేదనకీ దారితియ్యడం ఆశ్చర్యం కాదు. అలాగని మనం సత్యాన్వేషణని ఆపలేం. పక్కనపెట్టేయలేం. 'నిత్య నిరుత్తరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం' అని తెలిసికూడా మన వివేచనని కట్టిపెట్టలేం.
రెండు మేరుశిఖరాలు
రామకృష్ణారావుగారు గిడుగు రామ్మూర్తిగారి మునిమనమడు. గిడుగు సీతాపతిగారి మనమడు. అలా ఆ ఇద్దరిగురించి సాధికారికంగా మాట్లాడటానికి అన్ని విధాలా అర్హుడు. ఆయన తమ కుటుంబాల్లో పిల్లలకి తమ తాతల గురించి చెప్తున్నట్లుగా ఈ పుస్తకం రాసినప్పటికీ ఇది తెలుగు పిల్లలందరికోసం రాసినట్టే. ఒక్క పిల్లలేమిటి? తెలుగు వాళ్ళందరికోసం రాసినట్టే.
మరో గ్రంథాలయ ఉద్యమం
అందుకనే మంచికంటి, రవి కుమార్ అనే ఈ ఇద్దరు మిత్రులు గ్రంథాలయ ఉద్యమం పేరిట మొదలుపెట్టిన ఈ ప్రయత్నాలు కేవలం సాహిత్యానికో, రచయితలకో మాత్రమే సంబంధించినవి కావు. ఇవి సామాజిక ప్రక్షాళనా ప్రయత్నాలు అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం ముఖం లేని మనుషుల్తో నిండిపోకుండా ప్రతి ఒక్కరినీ ఒక చైతన్యవంతుడైన మానవుడిగా, మానవిగా తీర్చిదిద్దే దిశగా ఎంతో ప్రేమతో వేస్తున్న అడుగులు అనిపిస్తుంది.
