జ్యోతిర్మయ రోదసి

కిందటి ఏడు నా కవితాసంపుటి 'కోమల నిషాదం' వెలువరించినప్పటినుంచీ ఇప్పటిదాకా రాసిన 62 కవితల్తో ఈ 'జ్యోతిర్మయ రోదసి' వెలువరిస్తున్నాను. ఇది నా తొమ్మిదవ కవితాసంపుటి. 77వ పుస్తకం. ఈ పుస్తకాన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. పుస్తకప్రేమికులు, ఆత్మీయులు కొప్పరపు లక్ష్మీనరసింహారావుగారికి దీన్ని కానుక చేస్తున్నాను.

వేపపూల తీపిగాలి

అందుకని 64 కవితలు ఎంచి ఇమ్మని మానస చామర్తిని అడిగారు. ఆమె నేను ఇంతదాకా వెలువరించిన 8 సంపుటాల్లోంచీ, ఈ ఏడాది పొడుగునా నా బ్లాగులో రాస్తూ వచ్చిన కవితల్లోంచీ 64 కవితలు ఎంపికచేసారు. వాటిని ఆమే, అనల్ప బలరాం గారూ ఇద్దరూ కలిసి ఇలా 'వేపపూల తీపిగాలి' పేరిట ఈ రోజు విడుదల చేసారు.

నన్ను వెన్నాడే కథలు

నలభయ్యేళ్ళ కిందట నేను చదివిన కొన్ని కథలు, ప్రపంచ సాహిత్యంలోవీ, భారతీయ భాషల్లోవీ, ఇరవై కథలు, నన్ను వెన్నాడే కథలు గా, గత ఆరునెలలుగా మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ కథలన్నిటినీ ఒక్కచోట ఇలా పుస్తకరూపంగా మీకు అందిస్తున్నాను. ఈ పుస్తకం ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. పుస్తక ప్రేమికుల పెన్నిధి బంగారు రామాచారికి ఈ పుస్తకం కానుక చేస్తున్నాను. ఇది నా 75 వ పుస్తకం.