అందుకనే నిజమైన విద్యార్థి, విద్యనెప్పటికీ, విద్యనుంచి, కాపాడుకుంటూనే ఉండాలి. అసలు టెక్నాలజీలన్నింటికీ ఆధారమైన సత్యాన్వేషణనే నిజమైన విద్య అనీ, మనుషులు కోరుకోవలసిందీ, అభ్యసించవలసిందీ అదేననీ యుగాలుగా విద్యావేత్తలంతా చెప్తూవస్తున్నారు.
ఒక విద్యావేత్త
నాలుగేళ్ళ కిందట అనుమాండ్ల భూమయ్య రచన చదివినప్పుడు నేనూహించిందీ, ఇప్పుడు యలవర్తి భానుభవాని పుస్తకం చూసినతరువాత బలపడిందీ, ఇప్పటి సమాజం వేమనను ఒక విద్యావేత్తగా, మార్గదర్శిగా చూడబోతున్నారన్నదే.
తెలుగువాళ్ళ సాహిత్యతీర్థక్షేత్రం
ఎప్పుడేనా, ఎవరేనా ఒక కాంప్ బెల్ లాంటివాడు, కాంప్ బెల్ రాసింది చదివిన ఒక రాళ్ళపల్లి వంటివాడు, రాళ్ళపల్లిని చదివిన నాబోటివాడు ఈ దారమ్మట పోతున్నప్పుడు ఇక్కడ అడుగుపెట్టినప్పుడు, సరళమైన, నిర్మలమైన, ధారాళమైన జీవితానుభూతికి లోనవుతారనడంలో అనుమానం లేదు