సాహిత్య జగత్తు

ఆ వ్యాసాల్లో రవీంద్రుడు భారతీయ సహృదయ పరంపరకు ఇరవయ్యవ శతాబ్ది వారసుడిగా కనిపిస్తాడు. ఉప్పెనలాగా విరుచుకుపడ్డ పాశ్చాత్య సభ్యతను అవగాహనకు తెచ్చుకుంటూ ఆ వెలుగులో మన సాహిత్యాన్నీ, మన సాహిత్యం వెలుగులో ఆధునిక జీవితాన్నీ, ఆధునిక సందర్భంలో సాహిత్యకారుల కర్తవ్యాన్నీ తెలుసుకుంటూ చేసిన రచనలవి.

సాహిత్య విలాసం

ఒక జమీందారుగా టాగోర్ తూర్పు బెంగాల్ నుంచి ఒరిస్సాదాకా ఉన్న తమ భూములూ, ఎస్టేట్లూ చూసుకోవడానికి చేసిన ప్రయాణాల్లో రాసిన ఉత్తరాలవి. నదులూ, సరసులూ, మైదానాలూ, గ్రామాలూ, సూర్యాస్తమయాలూ, వెన్నెలా, మబ్బులూ, వర్షాల మధ్య రాసుకున్న ఉత్తరాలవి. 

రంగులవంతెన

మేఘావృతమైన ఆకాశం. నా హృదయమింకా మేఘసందేశ కావ్యం చుట్టూతానే పరిభ్రమిస్తున్నది. ఆ కావ్యం మనమీద జల్లే మంత్రమయసుగంధం ఒకపట్టాన వదిలేది కాదు. టాగోర్ నే చూడండి. ఆయన జీవితమంతా ఆ కావ్యాన్ని స్మరిస్తూనే వున్నాడు. ఎంతగా అంటే, తనను తాను 'ఆలస్యంగా, ప్రింటింగ్ ప్రెస్ యుగంలో జన్మించిన కాళిదాసుగా' చెప్పుకునేటంతలా.

Exit mobile version
%%footer%%