భారతీయ రచయిత

మనం కూడా ప్రపంచ సాహిత్యం చదువుతాం. కాని రాజారావులాంటి వాళ్ల పఠనానుభవం కేవలం ఒక పాఠకుడి అనుభవం కాదు, అది ఒక తీర్థయాత్రీకుడి అనుభవం. ఒక ఆధ్యాత్మిక సాధకుడి అనుభవం.

రాజారావుకి

ఈ అత్యంత అవినీతిమయమైన గణతంత్రం నుంచి మనకు ముక్తి ఉన్నదా? కవులు, రచయితలు రాజకీయ విమోచన కోసం కవిత్వం రాస్తున్నారు. మరికొందరు సామాజిక విమోచన కోసం గొంతెత్తుతున్నారు. మిత్రులారా, వాటిలో నాకు నమ్మకం చిక్కట్లేదు. ఇప్పుడు నేను చెయ్యగలిగిందల్లా, మీవోష్ చెప్పుకున్నట్టు దేవుడి రాజ్యంకోసం ప్రార్థించడమే.