అచ్చమైన తెలుగు కవిత్వం

ఒకప్పటి పాకనాటిసీమ పల్లెటూరి జీవితం, ఆ రైతులు, గోపాలకులు, ఆ పశువులు, ఆ అడవులు, ఆ పొలాలు, ఆ సంతోషాలు, ఆ భయాలు అవన్నీ మొదటిసారి తెలుగు కవిత్వంలోకి ప్రవేశించాయి. ప్రాజ్ఞన్నయ యుగంలో శాసనాలకు పద్యాల్ని ప్రసాదించిన గుండ్లకమ్మ ఒడ్డున ఇప్పుడు మట్టివాసనలీనే అచ్చమైన తెలుగు కవిత్వం ప్రభవించింది.