నేను తిరిగిన దారులు-17

ఇక్కడ అనేక శతాబ్దాలుగా అసంఖ్యాకమానవులు తమ జీవితాలను ప్రార్థనాగీతాలుగా, హారతిజ్యోతులుగా మార్చేసుకున్నారు. ఏ అతీతకాలంలో పరమశివుడు పార్వతీదేవి చెవిలో ఏ రహస్యసంభాషణ చేశాడోగాని ఆ రహస్యాన్ని ప్రజాస్వామికం చేయడం కోసమే జ్ఞానేశ్వరుడినుంచి సాయినాథుడిదాకా ఒక ఆధ్యాత్మిక ఉద్యమం కొనసాగుతూ వస్తోందనిపించింది.

ఆబాలగోపాల తరంగం

ఆ ఒక్క ప్రశ్న ఒక తేనెతుట్టెని కదిపినట్టయింది. ఎక్కడెక్కడి జ్ఞాపకాలూ, ఎక్కడెక్కడి మిత్రులూ, ఎప్పటెప్పటి కవిత్వాలూ గుర్తొచ్చాయి. 'మహాసంకల్పం' నుండి ట్రాన్స్ ట్రోమర్ దాకా. బైరాగి నుంచి కవితాప్రసాద్ దాకా.

ఆ వాక్కు అమృతం

సాధారణంగా అన్నమయ్య కీర్తనలు అనగానే భక్త్యావేశంలోనో, దేవుడి శృంగారాతిశయాన్నో వర్ణించే కీర్తనలే ఉంటాయని అందరూ అనుకుంటారుగాని, గొప్ప కవులందరిలానే ఆయన కూడా తన పాటల్లో తన కాలాన్ని లిఖించిపెట్టాడు. ఆ కల్లోలమయ కాలాన్ని, ఆ సంక్షుభిత సమయాన్ని.