ఎందుకంటే సాహిత్య చరిత్ర చదివి ఆధునిక పాశ్చాత్య కవిత్వం లేకపోతే ఆధునిక తెలుగు కవిత్వం లేదనుకుంటూ ఉన్నాం. కాని యూరపియన్ దుఃఖానికి మరీ అంతలా ఋణపడకుండానే తెలుగులో ఇంత అద్భుతమైన కవిత్వం వికసించిందని ఈ పుస్తకం మనకి స్పష్టంగా గుర్తుచేస్తోంది.
మునిగి తేలాం
ఒకరు కాదు, ఇద్దరు కథానాయకులు-ఒకరు నింగిలో, మరొకరు నీళ్ళల్లో. నిజానికి గగగనసీమలోని చంద్రుడికన్నా, సరోవరంలోని చంద్రుడే ఎక్కువ గ్లామరస్ గా ఉన్నాడు.
కొత్త సంవత్సరానికి కానుక
అనువాదం ఒక నిరంతర నిషిద్ధాక్షరి. వ్యత్యస్త దత్తపది. అనువాదకుడు ముందు మూలభాషలో పదాలు కాదు, కవి గుండెచప్పుడు వింటాడు. అప్పుడు తన చెవుల్ని ఆ గుండెకి దగ్గరగా చేర్చి ఆ మూల హృదయస్పందనాన్ని తన చెవుల్తో తన భాషలోకి అనువదిస్తాడు.
