బాబా బుల్లేషా కవిత్వం చదువుతూ ఉండగా,ఈ కవిత దగ్గరకు రాగానే హృదయం కంపించడం మొదలయ్యింది. ఇంగ్లీషు లోనే ఈ వాక్యాలు నా చెవిలో ఎవరో తుత్తార ఊదినట్టుగా నన్ను నా నిద్రలోంచి ఒక్కసారిగా గుంజి బయటకు లాగేసాయి.
నువ్వింకా ప్రజలకి బాకీ పడి ఉన్నావు
కవికీ పండితుడికీ మధ్య ఒక పచ్చికబయలు ఉంది. పండితుడు దాన్ని దాటాడా వివేకి అవుతాడు. కవి దాటాడా, ప్రవక్త అవుతాడు.
హృదయానందం రెణ్ణాళ్ళ వేడుక
అమృత సంతానం ఆరాధకుల్లో మరొక రసజ్ఞుడు వచ్చి చేరాడు. కవిత్వ రసవాది నౌదూరి మూర్తి గారు అమృతసంతానం చదువుతున్నారనీ, ఆయన ఒక విశ్లేషణ రాయబోతున్నారనీ వాసు నన్ను కొన్నాళ్ళుగా ఊరిస్తో ఉన్నాడు. రాత్రి ఆ వ్యాసం చదువుతోంటే, ఈ వాక్యాలకు వచ్చేటప్పటికి నా హృదయం కొట్టుకోడం ఆగిపోయింది