కాని ప్రాచీన ప్రాకృత కవిత్వం చేతుల్లోకి రాగానే ఆ వానాకాలపు నేరేడు చెట్ల అడివి నా కిటికీ దగ్గరకు వచ్చినట్టనిపించింది. అంతదాకా నా జీవితంలో చదువుకుంటూ వచ్చిన ఆధునిక విమర్శ ఆ రసరమ్య ప్రాచీన ప్రపంచాన్ని నాకు తెలియకుండా దాచి ఉంచిందనీ, అప్పటికే నేనెంతో పోగొట్టుకున్నాననీ అనిపించింది.
ఆషాఢమేఘం-11
ముల్లైప్పాట్టు ఒక సాధారణ ప్రణయ కవిత స్థాయి నుంచి ఒక శుభాకాంక్షగా మన కళ్ళముందు ఎదిగిపోతుంది. మేఘసందేశంలో కాళిదాసు ప్రణయవార్తకీ, శుభాకాంక్షకీ మధ్య సరిహద్దుని చెరిపేసాడని టాగోర్ అంటున్నప్పుడు, కాళిదాసుకన్నా ఎంతో కాలానికి పూర్వమే ఒక ప్రాచీన తమిళ కవి ఆ పని చేసాడని ఆయనకు తెలీదు!
ఆషాఢమేఘం-10
తమిళదేశాన్ని సాంస్కృతికంగా ఏకం చెయ్యడంలో సంగం కవులు, భావుకులు చూపించిన ఈ వివేకం, ఈ ప్రజ్ఞ ఎంత బలమైనవంటే, తర్వాత రోజుల్లో నాయనార్లకీ, ఆళ్వార్లకీ ఈ రసజ్ఞతనే పాదుగా నిలబడింది. ఇన్ని శతాబ్దాల తరువాత కూడా తమిళుల్ని ప్రాంతీయ భేదాలకు అతీతంగా దగ్గరగా నిలబెడుతున్న జీవజలాలు సంగం సాహిత్యం నుండి ఊటలూరినవే.
