వీరవాక్యం

సిద్ధకవులు, నాథకవులు, చర్యాగీతకవులు, బుల్లేషా, కబీరు వంటి సూఫీకవుల గురించి తెలుసుకున్న ఎంతో కాలానికి గాని నా ఇంటిపెరడులోనే నెలకొన్న చింతామణిని గుర్తించలేకపోయాను. తక్కిన తెలుగు గీతకవులంతా ఒక ఎత్తూ, వీరబ్రహ్మం ఒక్కడూ ఒక ఎత్తు.

తెలుగువాడి గుండెచప్పుళ్ళు

తరిగొండ ప్రసన్న నరసింహస్వామి గుడి ముంగిట నిల్చుని మరొకసారి వెంగమాంబకు మనసారా నమస్సులర్పించాను. కొందరి దృష్టి చరిత్ర మీద ఉంటుంది, చరిత్ర నిర్మించడం మీద ఉంటుంది. మరికొందరి దృష్టి చరిత మీద ఉంటుంది. తమని తాము సంస్కరించుకునే ప్రయత్నంలో తమకు తెలియకుండానే వారు కొత్త చరిత్ర సృష్టిస్తారు. వెంగమాంబ రెండవతరహాకి చెందిన మనిషి, కవి.