2010 నుంచి 2017 మధ్యకాలంలో రాసిన విమర్శనాత్మక వ్యాసాలు 'సాహిత్య సంస్కారం' పేరిట ఎమెస్కో ప్రచురణగా వెలువడ్డాయి. ఈ పుస్తకంలోని 64 వ్యాసాల్లో కవిత్వం, కథ, నవల, నాటకం, లేఖాసాహిత్యప్రక్రియలతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక అధ్యయనాలకు సంబంధించిన గ్రంథాల పరిశీలన ఉంది.
సహృదయునికి ప్రేమలేఖ
1985-2000 మధ్యకాలంలో వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన వివిధ సాహిత్య ప్రశంసాత్మక వ్యాసాల నుంచి ఏరి కూర్చిన వ్యాసాల సంపుటి.
కొన్ని కలలు, కొన్ని మెలకువలు
వాడ్రేవు చినవీరభద్రుడు జిలా గిరిజన సంక్షేమాధికారిగా 1987 నుంచి 1995 దాకా విజయనగరం, విశాఖపట్టణం, కర్నూలు, అదిలాబాదుజిల్లాల్లో పనిచేసిన కాలంలో ప్రాథమికవిద్యను గిరిజనప్రాంతాల్లో సార్వత్రీకరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు. 1995 నుంచి 1997 మధ్యకాలంలో గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆ ప్రయత్నాలకొక సమగ్రరూపాన్ని సంతరించి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రమంతటా అమలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగించారు. ఆ అనుభవాల్లో ఆయన సాఫల్యవైఫల్యాలను వివరించే రచన 'కొన్ని కలలు, కొన్ని మెలకువలు.'
