ఆషాఢ మేఘం -24

ప్రవాసితులందరి హృదయాల్లోనూ గూడుకట్టుకున్న విరహవేదనకి ఆయన తన కవితద్వారా ఒక గొంతునిచ్చాడు. యుగాలుగా అణచిపెట్టుకున్న దుఃఖం ఆయన కవిత్వధారలో జలజలా కురవడం ఈ కవితచదువుతున్నంతసేపూ మనకి తెలుస్తూనే ఉంటుంది. బహుశా, మేఘసందేశం కావ్యానికి ఇంతకన్నా ఘననీరాజనం మరొకరు సమర్పించలేరేమో!

ఆషాఢ మేఘం-19

కాని మేఘసందేశంలోని రసఝురి ఇక్కడే ఉంది. వసంతపవనంతో సందేశం పంపి ఉంటే అది తనకీ, తన భార్యకీ మాత్రమే సంబంధించిన శుభవార్త అయి ఉండేది. కాని ఋతుపవన మేఘం సమస్తలోకానికి కల్యాణప్రదం. ఆ మేఘాన్ని చూడగానే కడిమి పుష్పిస్తుంది. బలాకలు సంతోషంతో ఎగురుతాయి. ఆ మేఘగర్జన వినగానే పుట్టగొడుగులు నిద్రలోంచి మేల్కొంటాయి. రైతులు నాగళ్ళు భుజాన వేసుకుని వ్యవసాయం మొదలుపెడతారు.

ఆషాఢమేఘం-11

ముల్లైప్పాట్టు ఒక సాధారణ ప్రణయ కవిత స్థాయి నుంచి ఒక శుభాకాంక్షగా మన కళ్ళముందు ఎదిగిపోతుంది. మేఘసందేశంలో కాళిదాసు ప్రణయవార్తకీ, శుభాకాంక్షకీ మధ్య సరిహద్దుని చెరిపేసాడని టాగోర్ అంటున్నప్పుడు, కాళిదాసుకన్నా ఎంతో కాలానికి పూర్వమే ఒక ప్రాచీన తమిళ కవి ఆ పని చేసాడని ఆయనకు తెలీదు!