అమృతానుభవం

అనుభవామృతాన్ని తెలుగు చేయడానికి రాధాకృష్ణమూర్తిగారికన్నా తగినవారు ఎవరుంటారు? ఉపనిషత్తులూ, భగవద్గీతలతో పాటు ఆధునిక పాశ్చాత్య చింతనని కూడా సాకల్యంగా అర్థం చేసుకుని సమన్వయించుకోగలిగిన ఆ వేదాంతి చేతులమీదుగా వెలువడటం కోసమే ఆ పుస్తకం ఇన్నాళ్ళుగా నిరీక్షిస్తూ ఉన్నదని అర్థమయింది

దశార్ణదేశపు హంసలు

అట్లాసులూ, ఫొటోగ్రాఫులూ లేని కాలంలో ఈ దేశాన్ని దర్శించిండానికి కవిత్వమూ, పురాణాలూ, స్థలపురాణాలే ఆధారంగా ఉండేవి. ముఖ్యంగా కవులు తాము దర్శించి నలుగురికీ చూపించిన దేశం ఎంతో హృద్యంగానూ, ప్రేమాస్పదంగానూ ఉండేది.వారు చిత్రించిన లాండ్ స్కేప్ కేవలం భౌగోళికమైంది మాత్రమే కాదు.