నిష్టుర యథార్థం ముందు కళాకారుడు మనిషిగా ప్రవర్తించవలసిన పద్ధతి ఏమిటని భారతీయ సాహిత్యవేత్తలూ, కళాకారులూ యుగాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. కొందరు,ఈ లోకంలోనే ఈ మనుషుల మధ్యనే తాము కూడా నిలబడి వాళ్ళ కష్టసుఖాలు పంచుకోవాలనుకున్నారు. మరి కొందరు ఊ తావూ జూలానే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి తిరిగిరాని తీరాలకు చేరాలనుకున్నారు. ఇంకొందరు తమ కళాస్వప్నలోకపు ద్వారం దగ్గరే నిలబడి ఉంటారు, ఇటు వైపు రాలేరు, అలాగని పూర్తిగా అటువెళ్ళిపోరు.
ఇద్దరు మహనీయులు
ఆదివారం సంజీవదేవ్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాదులో మొదలయ్యాయి. హైదరాబాదు స్టడీ సర్కిల్లో జరిగిన సమావేశంలో చాలామంది కవులు, కళాకారులు, పత్రీకాసంపాదకులు ఆయన్ని తలుచుకున్నారు.