చంపారన్ సత్యాగ్రహం

కాని, వందేళ్ళ తరువాత, చంపారన్ సత్యాగ్రహం గురించి అంతమంది మాట్లాడుతుండగా వింటున్నప్పుడు, ఇప్పటి ప్రపంచానికి దారిచూపించే స్ఫూర్తి ఆ ఉద్యమస్మృతిలో ఇంకా సజీవంగానూ, బలంగానూ ఉందనే అనిపించింది

గిరిజన సాహిత్యం

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన, భాషా సాహిత్యాల మీద సాహిత్య అకాడెమీ విశాఖపట్టణంలో 26, 27 వ తేదీల్లో రెండు రోజుల సదస్సు నిర్వహించింది. ఒక భాషా ప్రాంతానికి చెందిన గిరిజనుల సాహిత్యం మీద ఒక సదస్సు నిర్వహించడం అకాడెమీ చరిత్రలోనే ఇది మొదటిసారి అని విన్నాను. ఆ సదస్సులో సమాపన ప్రసంగం చేసే గౌరవం నాకు లభించింది.