కవియోగి

హిందువులూ, ముస్లిములూ తప్ప మనుషులు కనబడకుండా పోతున్న కాలం ఇది. ఇట్లాంటి కాలంలో ఖుస్రో, భితాయీ, గాలిబ్, మీర్ వంటి కవులు పదే పదే గుర్తుకు రావడం సహజం. వాళ్ళు హిందూ సంకేతాలకీ, ముస్లిం చిహ్నాలకీ అతీతమైన ఒక ప్రేమైక వదనం కోసం పరితపించారు. మనుషుల్ని ప్రేమించేవాళ్ళెవరైనా పంచుకోగలిగేది అటువంటి పరితాపమొక్కదాన్నే.