ఒకప్పుడు హళేబీడు, రామప్ప వెళ్ళినప్పుడు ఆ శిల్పులు రాతిని వెన్నగా మార్చి శిలని సంగీతంగా వికసింపచేసారని రాసుకున్నాను. కాని మన కాలంలో మన ఒక చిత్రకారుడు ఇలా ఒక దారుఖండాన్ని ఒక విష్ణుస్తుతిగా మార్చడం నా కళ్లారా చూడగలనని ఎన్నడూ అనుకోలేదు.
ప్రేమలోనూ, కళలోనూ
ఒక పట్టణం మహానగరంగా మారిందని ఎప్పుడు చెప్పగలం? ఆ ఊళ్ళో నీటిరంగుల చిత్రలేఖనసామగ్రి దొరికినప్పుడు అని చెప్తాన్నేను.