భగవంతుడి లేఖకుడు

భగవత్ప్రేమని అనుభూతిచెందడం, దాన్ని ఉక్కులాంటి భాషలో కరిగించి పోతపొయ్యడం, తద్వారా తక్కినవాళ్ళు కూడా ఆ ప్రేమానుభూతికి పాత్రులయ్యేలా చూడటం అతడి ఉద్దేశ్యం. అతడి దృష్టిలో కవిత్వం కేవలం భగవంతుడి కోసమే ఎందుకంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటీ సర్వేశ్వరుడి కోసమే కాబట్టి.