కాని రామాయణంలో ఉండే విశిష్టత ఏమిటంటే, వాల్మీకికి పూల గురించి మాత్రమే కాదు, ఏ పూలు ఎప్పుడు పూస్తాయో, ఏ పూలు ఎక్కడ పూస్తాయో కూడా తెలుసు. వసంత శోభని వర్ణించినప్పుడు మాత్రమే కర్ణికార పుష్పాల గురించి వర్ణిస్తాడు.
పుష్పప్రీతి
తానిట్లా గీతాలల్లుకుంటూ ఉంటే లోకానికి ఏం మేలు జరుగుతుందని ఒకసారి ఎవరో టాగోర్ అని అడిగారట. అందుకాయన ఈ పొగడచెట్టు వల్ల ఈ ప్రపంచానికి ఎంత ప్రయోజనమో తన కవిత్వం వల్లా అంతే అని సమాధానమిచ్చాడట.