పన్నువసూలు చేసే పాండురంగడు

భక్తి కవులే లేకపోతే భారతదేశం ఊపిరాడనంత మతమౌఢ్యంలో కూరుకుపోయి ఉండేది. భక్తి కవులే లేకపోతే దేవుడు ఒక విగ్రహంగా, ఒక చిహ్నంగా, ఒక పతాకంగా, ఒక క్రతువుగా మాత్రమే మిగిలిపోయి ఉండేవాడు. భక్తి కవుల వల్ల మాత్రమే భారతీయ భావోద్వేగాలు సంగీతమయంగా, సంతోషమయంగా, సహజీవనయోగ్యంగా వ్యక్తీకరణకు నోచుకోగలిగేయి.