శ్రీపర్వతప్రకరణం

అది తెలుగులో మొదటి యాత్రాకథనం. రామాయణ, మహాభారతాల్ని వదిలిపెడితే, భారతీయ భాషాసాహిత్యాల్లో అటువంటి తీర్థయాత్ర కథనం మరొకటి కనిపించదు. అది తెలుగు కథనం మాత్రమే కాదు, అందులో గీర్వాణ, కర్ణాట, తమిళ, మహారాష్ట్ర దేశాల భక్తుల కీర్తనలు కూడా ఉన్నందువల్ల భారతీయ సాహిత్యంలోనే మొదటి బహుభాషా యాత్రాకథనం కూడా.

దశార్ణదేశపు హంసలు

'ఆ హంసలక్కడ ఉండేది కొన్నాళ్ళే'. ఈ వాక్యం చిన్నప్పణ్ణుంచి చదువుతున్నాను. కాళిదాసు ఈ మాట దశార్ణదేశపు హంసల గురించి రాసాడనే అనుకున్నాను ఇన్నాళ్ళూ. ఇప్పుడు తెలుస్తోంది, ఆ హంసలు నా ప్రాణాలేనని' అన్నారాయన తన డెబ్బై ఏళ్ళ అస్వస్థ శరీరాన్ని చూసుకుంటో.