ఆబాలగోపాల తరంగం

ఆ ఒక్క ప్రశ్న ఒక తేనెతుట్టెని కదిపినట్టయింది. ఎక్కడెక్కడి జ్ఞాపకాలూ, ఎక్కడెక్కడి మిత్రులూ, ఎప్పటెప్పటి కవిత్వాలూ గుర్తొచ్చాయి. 'మహాసంకల్పం' నుండి ట్రాన్స్ ట్రోమర్ దాకా. బైరాగి నుంచి కవితాప్రసాద్ దాకా.

ఆ వాక్కు అమృతం

సాధారణంగా అన్నమయ్య కీర్తనలు అనగానే భక్త్యావేశంలోనో, దేవుడి శృంగారాతిశయాన్నో వర్ణించే కీర్తనలే ఉంటాయని అందరూ అనుకుంటారుగాని, గొప్ప కవులందరిలానే ఆయన కూడా తన పాటల్లో తన కాలాన్ని లిఖించిపెట్టాడు. ఆ కల్లోలమయ కాలాన్ని, ఆ సంక్షుభిత సమయాన్ని.

ప్రతి గీతం ఒక రథోత్సవం

జయదేవుడు కూడా తన గీతాలు 'కేశవ కేళి రహస్యాన్ని' గానం చేస్తున్నాయని చెప్పుకున్నాడేగాని, తాను 'కేశవదాసి' ని కాగలిగానని చెప్పుకోలేదు. ఆ ఒక్క పదంతో అన్నమయ్య శాశ్వతంగా స్వామి చరణాల దగ్గర తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగాడు.