ఉన్నత విద్యలో కొత్త ప్రయోగాలు

మౌలనా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివెర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక ఓరియెంటేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నాను. దేశవ్యాప్తంగా వివిధ విస్వవిద్యాలయాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చెరర్లు, ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల ప్రిన్సిపాళ్ళు సుమారు యాభై మందికి ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం.

21 వ శతాబ్దంలో విద్య

నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఇన్ స్టిట్యూట్స్ ఛైర్మనూ, మిత్రులు ప్రసన్నకుమార్ గారు, తమ సంస్థ వ్యవస్థాపకదినోత్సవంలో కీలక ప్రసంగం చెయ్యమని ఆహ్వానించేరు. నిన్న యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాదు లో జరిగిన ఆ సమావేశానికి ప్రసిద్ధ గాంధేయవాది, అసొసియేషన్ ఫర్ వాలంటరీ అసొసియేషన్స్ ఫర్ రూరల్ డవలప్ మెంట్( అవర్డ్) అధ్యక్షుడు పి.ఎం.త్రిపాఠి ముఖ్య అతిథి.

ఇండీ రూట్స్

సోమాజిగూడ మినర్వా కాఫీ షాపులో ఓ మధ్యాహ్నం టిఫిన్ చేద్దామని అడుగుపెట్టగానే నా మిత్రురాలొకామె చాలారోజుల తర్వాత కనిపించింది. మేమిద్దరం కుశలప్రశ్నలమీంచి మా పాతజ్ఞాపకాలు నెమరేసుకున్నాం. మాటలమధ్యలో, మేమొకప్పుడు, చార్మీనార్ దగ్గర చీరలమీద అద్దకం చేసే బ్లాక్ ప్రింటింగ్ కళాకారుల్ని వెతుక్కున్న ఒక సాయంకాలాన్ని కూడా తలుచుకున్నాం. ఆ అద్దకం గుర్తురాగానే ఆమె 'మీకో గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను రండి ' అంటో, ఆ షాపింగ్ కాంప్లెక్సు మొదటి అంతస్థులోకి తీసుకువెళ్ళింది. మెట్లెక్కగానే మొదటిషాపే.

Exit mobile version
%%footer%%