సంత్ జ్ఞానేశ్వర్ రాసిన అమృతానుభవాన్ని తెలుగులోకి అనువదించమని గంగారెడ్డి చాలాకాలంగా అడుగుతున్నాడు. ఆ పుస్తకాన్ని ఎవరైనా మరాఠీ పండితుడి ద్వారా ఒక్కసారైనా విని ఆ పనికి పూనుకుంటానని చెప్తూ వచ్చాను. నిన్నటికి ఆ అవకాశం దొరికింది. మాకోసం పల్దెప్రసాద్ అదిలాబాదులో ఒక మరాఠీ పండితుణ్ణి వెతికి పెట్టాడు. నిన్న పొద్దున్న రవీంద్రకుమారశర్మగారి కళాశ్రమంలో చావర్ డోల్ గిరీష్ అనే పండితుడు తానే స్వయంగా మా దగ్గరకొచ్చి అమృతానుభవం లోంచి కొన్ని ఓవీలు వినిపించి వాటి ప్రతిపదార్థ తాత్పర్యం వివరించాడు.
మరోసారి ఇల్లు మారాం
మరోసారి ఇల్లు మారాం. భారతీయ రచయితల్లో ప్రేమ్ చంద్ తర్వాత ఎక్కువ ఇళ్ళు మారింది నేనేనని రాళ్ళబండి కవితాప్రసాద్ అన్నాడు.రాజధాని మారిపోయే వేళ మళ్ళా ఇల్లు మారడమేమిటన్నారు కొందరు. కానీ మారక తప్పింది కాదు. ఎన్నాళ్ళు ఉంటామో కాని, ఇంటి చుట్టూ ఉన్న కొద్దిపాటి ఖాళీస్థలంలోనూ ఒక అందమైన పూలతోట పెంచుకోవచ్చన్న కోరిక నన్నూరించింది.
శోకం శ్లోకంగా మారిన మరోకథ
Poetry (2010) సినిమా చూసేటప్పటికి అర్థరాత్రి దాటిపోయింది.కొన్నాళ్ళ కిందట ఒక మిత్రురాలు చెప్పినప్పణ్ణుంచీ చూడాలనుకుంటున్నది నిన్నటికి చూడగలిగాను. సినిమా పూర్తయ్యేటప్పటికి, చెప్పలేని సంతాపమేదో హృదయాన్ని చుట్టుకుపోయింది. సినిమా అదృశ్యమైపోయింది. అప్పటిదాకా చూసిన దృశ్యాలన్నీ కలగలిసి ఒక బూడిదరంగు పొరలాగా మనసుమీద పరుచుకుపోయేయి.
