అంజనగంధి

వాల్మీకి నుంచి టాగోర్ దాకా భారతీయ కావ్యవాక్కుకి ప్రాణం పోసిన సరస్వతి వేదవాక్కు. అనుభవాన్ని అక్షరంగా మార్చే విద్య వేదఋషులకి తెలిసనట్టుగా మరెవరికీ తెలియదేమో. వేదాన్ని రహస్యవిద్యగానూ, బ్రహ్మవిద్యగానూ సాధారణ పాఠకుడికి అందకుండా చేసినందువల్ల మనం ఇప్పటికే సాంస్కృతికంగా ఎంతో నష్టపోయాం

దశార్ణదేశపు హంసలు

అట్లాసులూ, ఫొటోగ్రాఫులూ లేని కాలంలో ఈ దేశాన్ని దర్శించిండానికి కవిత్వమూ, పురాణాలూ, స్థలపురాణాలే ఆధారంగా ఉండేవి. ముఖ్యంగా కవులు తాము దర్శించి నలుగురికీ చూపించిన దేశం ఎంతో హృద్యంగానూ, ప్రేమాస్పదంగానూ ఉండేది.వారు చిత్రించిన లాండ్ స్కేప్ కేవలం భౌగోళికమైంది మాత్రమే కాదు.

రంగులవంతెన

మేఘావృతమైన ఆకాశం. నా హృదయమింకా మేఘసందేశ కావ్యం చుట్టూతానే పరిభ్రమిస్తున్నది. ఆ కావ్యం మనమీద జల్లే మంత్రమయసుగంధం ఒకపట్టాన వదిలేది కాదు. టాగోర్ నే చూడండి. ఆయన జీవితమంతా ఆ కావ్యాన్ని స్మరిస్తూనే వున్నాడు. ఎంతగా అంటే, తనను తాను 'ఆలస్యంగా, ప్రింటింగ్ ప్రెస్ యుగంలో జన్మించిన కాళిదాసుగా' చెప్పుకునేటంతలా.