సమకాలీన భారతీయ దార్శనికుల్లో అగ్రేసరుడైన డా.కొత్త సచ్చిదానందమూర్తి వేదాలను అర్థం చేసుకోవడానికీ, వ్యాఖ్యానించడానికీ చేసిన ప్రయత్నం ఈ పుస్తకం. వేదాలపై ఇంతదాకా వచ్చిన ఆధునిక భారతీయ, పాశ్చాత్య వ్యాఖ్యానాల గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు, అయినప్పటికీ, ఆయన వేదాలను అర్థం చేసుకోవడం కోసం ప్రధానంగా నిరుక్తం వైపూ, పూర్వ ఉత్తర మీమాంసల వైపూ, స్మృతి, ఇతిహాస, పురాణాల వైపూ, సాయణుల వైపూ, ఇతర భాష్యకారుల వైపూ మొగ్గు చూపడం ఈ రచనలో విశేషం.
ఒక విజేత ఆత్మకథ
భారతరాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, రక్షణవ్యవహారాల నిపుణుడు, దార్శనికుడు డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం తన జీవితయానాన్ని వివరిస్తూ రాసుకున్న ఆత్మకథ Wings of Fore కు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం
నా దేశ యువజనులారా
ఎమెస్కో ప్రచురించిన ఈ గ్రంథాన్నిడా.పి.వి.నరసింహారావు ఆవిష్కరించారు. ఈ అనువాదానికి 2008 కు గాను ఉత్తమ అనువాదంగా కేంద్రసాహిత్య అకాదెమీ పురస్కారం లభించింది.
