బసవన్న వచనాలనుంచి మూడువందల వచనాలు ఎంపికచేసి నేను తెలుగులోకి అనువదించి పుస్తకంగా వెలువరించిన సంగతి మీకు తెలిసిందే. కిందటి డిసెంబరులో తీసుకువచ్చిన ఆ పుస్తకం మీద ఇన్నాళ్ళకు ఒక నిండైన సమీక్ష లభించింది. ఆత్మీయులు న్యాయపతి శ్రీనివాసరావు బసవన్న పట్ల అపారమైన గౌరవంతోనూ, నా పట్ల అపారమైన అభిమానంతోనూ రాసిన ఈ వ్యాసాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.
ఒక ఉత్తరం అందింది
పోస్టు చేసిన ఉత్తరాలు పుస్తకంగా వెలువరించిన వెంటనే జవాబుగా నిన్ననే నాకో ఉత్తరం అందింది. ఇది సోమశేఖర్ రాసిన ఉత్తరం. ఈ జవాబు చదవగానే నేను రాసిన ఉత్తరాలు చేరవలసిన చోటుకే చేరాయనిపించింది. అందుకని ఆ ఉత్తరాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను.
శరణార్థి
సమ్మెట ఉమాదేవి ఆదర్శ ఉపాధ్యాయులు. జీవితమంతా బడిపిల్లల్తో గడిపారు. ముఖ్యంగా మారుమూల గిరిజన తండాల్లో బాలబాలికలకి ఒక పూలతోవ చూపిస్తూ గడిపారు. ఫేస్ బుక్ లో తన వాల్ మీద నూరు కథల వరహాలు పేరిట తెలుగులో వచ్చిన కథల్లో తనకు నచ్చిన కథల్ని ఎంచుకుని తన గొంతులో మిత్రులకు వినిపిస్తూ ఉన్నారు. అందులో నూరవకథగా నా 'శరణార్థి' కథను వినిపించారు.
