ఈలోగా గత పుష్కరకాలంగా నేను అప్పుడూ అప్పుడూ మిత్రుల్తో పంచుకుంటూ వస్తున్న నా విద్యానుభవాల్ని ఒక సంపుటంగా వెలువరించాలనుకున్నాను. ముఖ్యంగా మా దేవమ్మ డా.నన్నపనేని మంగాదేవిగారికి ఆ పుస్తకం కానుక చెయ్యాలన్న ఉత్సాహం కూడా ఒక కారణం. నిన్న శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ వారి లలితకళా ఉత్సవంలో ఈ పుస్తకాన్ని మా అక్క ఆవిష్కరించి నా తరపున ఆమెకు సమర్పించింది. ఇది నా 51 వ పుస్తకం. దీన్నిక్కడ ఇ-బుక్ గా మీతో పంచుకుంటున్నాను. 45 వ్యాసాలు. 216 పేజీలు. దీన్ని మీ మిత్రుల్తో, మీ సంస్థల్లో, మీ ఉద్యమాల్లో మీతో కలిసి పనిచేస్తున్న కార్యకర్తల్తో, ఉపాధ్యాయుల్తో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
