ఇది కదా, ఒక కవిని కన్నందుకు, ఆ ఊరికి లభించే భాగ్యం! మరో కవి ఎవరేనా ఉన్నారా? ఇలా ఒక మేఘాన్ని తన ఊరికి ఆహ్వానించి అక్కడి విశేషాలన్నీ దగ్గరుండీ మరీ చూపించడానికి ఉత్సాహపడ్డ కవి!
ఆషాఢమేఘం-21
ప్రాచీన కాలంలో కవిత్వమంటే వర్ణన. ప్రధానంగా శబ్దాలతో చేసే వర్ణన. చిత్రలేఖకుల భాషలో చెప్పాలంటే వర్ణలేపనం. సంగీతకారుల భాషలో చెప్పాలంటే స్వరప్రస్తారం. కవి వర్ణన నెపంతో కొత్త భాషని తన శ్రోతలకి అందిస్తాడు. అది వాళ్ళకి కొత్త రెక్కలిచ్చినట్టు ఉంటుంది.
ఆషాఢ మేఘం-20
పూర్వమేఘంలోని ఈ నలభై-యాభై పద్యాల్లో కాళిదాసు సంస్కృతకవిత్వాన్ని మొదటిసారిగా పొలాలమ్మట తిప్పాడు, అడవుల్లో, కొండల్లో విహరింపచేసాడు. గ్రామాల్లో రైతుల్ని, పథికవనితల్నీ పరిచయం చేసాడు.
