ఆషాఢమేఘం-6

ఒక కావ్యంలోగాని, ఇతిహాసంలోగాని, పురాణంలోగాని వర్ణన కోసమే వర్ణన చేసేవాడు సాధారణ కవి. కాని మహాకవి ఆ వర్ణనని కథలో పొదుగుతాడు. కథాప్రయోజనానికి ఆ వర్ణనని కూడా ఒక ఆలంబనం చేసుకుంటాడు. కిష్కింధా కాండలోని ఈ వర్షర్తు వర్ణన ప్రయోజనం కేవలం నాయకుడి విరహాన్ని చెప్పడం కోసమే అయి ఉంటే ఇది భావుకుల్ని ఇంతగా ఆకర్షించి ఉండేది కాదు.

ఆషాఢమేఘం-5

జీవితకాలం అడవుల్లో బతికినవాడికి మాత్రమే తోచగల అనుభూతి ఇది. వాన పడే మధ్యాహ్నాల్లో అడవుల అందాన్ని చూసి మనతో పంచుకున్న కవి నాకిప్పటిదాకా ప్రపంచ కవిత్వంలో మరొకరు కనబడలేదు. ఒక జూలై మధ్యాహ్నం అడ్డతీగల్లో అడవుల్లో వానపడుతున్నప్పుడు, ఈ శ్లోకమే నాకు పదే పదే గుర్తొస్తూ ఉండింది.

ఆషాఢమేఘం-4

కాని వానాకాలం రాముడిలోని మనిషి బయటపడే కాలం. కాబట్టి రాముడే 'చూడు మనం చెప్పుకుంటున్న ఆ వానాకాలం సమీపించింది' అని అనడంలో కూడా గొప్ప ఔచిత్యం ఉంది. ఎందుకంటే ఆ వర్షర్తువర్ణన మొత్తం ఒక భావుకుడైన మానవుడు, అసలే రసార్ద్రహృదయుడు, మరింత రసార్ద్రభరితుడై చేసిన వర్షస్తోత్రంలాగా మనకి వినిపిస్తుంది.

Exit mobile version
%%footer%%