స్మృతిగా, స్వప్నంగా, ఊహగా

ఇప్పుడామె కవిత్వం మనం చదువుతూన్నప్పుడు మనం కూడా మన మౌలిక కౌటుంబిక అనుబంధాల్ని వంచనా రహితంగా పరికించుకోకుండా ఉండలేం. అందుకనే ఆమె మనకి అత్యంత ఆత్మీయురాలిగా గోచరిస్తూ ఉన్నది.

ఎమిలీ డికిన్ సన్ వారసురాలు

పొందడం, పోగొట్టుకోవడం, సంతోషం, సంతోషరాహిత్యం, సాన్నిహిత్యం, ఒంటరితనం లాంటి అత్యంత మౌలిక మానవానుభవాల్ని ఆమె తన మనసనే మైక్రోస్కోపులో పెట్టి పరీక్షిస్తూనే వచ్చింది. ఆమె కవిత్వం నుంచి మనకి లభించగల అతి గొప్ప ఉపాదానమిదే: ఆ కవితలు చదువుతున్నప్పుడు, మన తల్లులూ, మన తండ్రులూ మనకి కొత్తగా పరిచయమవుతారు.

విద్యా కానుక

రెండు లక్షల మంది గిరిజన విద్యార్థులకే ఎప్పుడూ ఏ సామగ్రీ సకాలంలో పంపిణీ కాని రోజులనుండి, నేను నా ప్రభుత్వోద్యోగంలో, 42 లక్షల మంది విద్యార్థులకి వారి విద్యాసామగ్రి మొత్తం ఒక స్కూలు కిట్ గా అందించగలిగే రోజులదాకా ప్రయాణించాను.

Exit mobile version
%%footer%%