కాళీపట్నం రామారావు మాష్టారి తొంభైవ పుట్టినరోజు. నవతీ తరణం పేరిట విశాఖ పట్నంలో ఈ రోజొక మహోత్సవం జరగనుంది. ఆగష్టు 29, గిడుగు పుట్టినరోజు , తెలుగుభాషోత్సవంగా జరుపుకుంటున్నట్టే, నవంబరు 9 ని తెలుగు కథానికోత్సవంగా జరుపుకోవలసిన రోజు.
గోపీనాథ మొహంతి
చాలా రోజులుగా పుస్తకాల అలమారులో ఉన్న నవల, గోపీనాథ మొహంతి ' దాదీ బూఢా ' (Ancestor, సాహిత్య అకాదెమీ, 1997) బయటకు తీసాను. ఆ అనువాదం ఏకబిగిన చదివించింది.చాలా ఏళ్ళ కిందట, 'అమృత సంతానం' చదివినప్పుడు ఎటువంటి సంతోషం కలిగిందో, అటువంటి సంతోషంలోనే చాలా సేపటిదాకా ఉండిపోయాను.
మరొకసారి అడవిదారుల్లో
ఆ గిరిజన గ్రామంలో ఆ పెంకుటిళ్ళు, ఆ మట్టి అరుగులు, ఆ పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం చూడగానే ఎప్పట్లానే నా మనసు అక్కడే ఉండిపోవాలని కొట్టుకుపోయింది. ఆ అరుగులమీద కూచుని భాగవతమో, బుద్ధుడి సంభాషణలో, స్పినోజా లేఖలో చదువుకోవడం కన్నా జీవితంలో ఐశ్వర్యమేముంటుంది అనిపించింది.
