అమృత షెర్-గిల్

డిల్లీలో క్రాఫ్ట్స్ మూజియం చూసిన తరువాత,ఆధునిక భారతీయ చిత్రకారులంతా కోరుకునే గమ్యస్థలి, నేషనల్ గాలరీ ఆఫ్ మాడరన్ ఆర్ట్ కూడా చూసాం. రాజస్థాన్ పింక్ స్టోన్ తో కట్టిన జైపూర్ హౌస్ లో అడుగుపెడుతూనే ప్రాంగణంలో మరీ అంత ఆకర్షణీయంగా లేని వింకారోజియా పూలవరసలు. బయట ఎండకి ఎండి వానకి తడుస్తున్నట్టున్న శిల్పాలు.

క్రాఫ్ట్స్ మూజియం

శిథిలాలూ, సమాధులే కాకుండా డిల్లీలో చూడవలసిన స్థలాల్లో మూజియాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు కొన్ని ప్రదర్శన శాలలు చూసేను కాబట్టి, ఈ సారి ఏవైనా కొత్త మూజియాలు చూడాలని ఒక టాక్సీ ఎక్కిన మాకు పురానా ఖిలా మలుపు తిరుగుతుండగానే క్రాఫ్ట్స్ మూజియం కనిపించింది. పక్కనే శిల్పసంగ్రహాలయమని దేవనాగరిలిపిలో అక్షరాలు. నేనెప్పుడూ వినిఉండని ఆ సంగ్రహాలయమెట్లా ఉంటుందోనని లోపల అడుగుపెట్టినవాళ్ళం అక్కడే మూడు గంటల పాటు ఉండిపోయాం. 

వాళ్ళు తమ ప్రపంచాన్ని పునర్నిర్మిస్తున్నారు

తెలంగాణా టూరిజం వారు హైదరాబాదు మెట్రొపొలిస్ సందర్భంగా వారం రోజులపాటు చిత్రలేఖన శిబిరం నిర్వహిస్తున్నారు. తారామతి-బారాదరిలో సుమారు 90 మంది తెలంగాణా చిత్రకారులు రెండు విడతలుగా పాల్గొన్న ఈ శిబిరానికి రెండుసార్లు వెళ్ళాను. అంతమంది చిత్రకారులు ఒక్కచోట చేరి వర్ణచిత్రాలు గియ్యడంలో ఏదో గొప్ప శక్తి ఉత్పత్తి అవుతున్నట్టనిపించింది.