యుగయుగాల చీనా కవిత-23

తమని స్పందింపచేసిన ఆ క్షణాల్ని ఒక కవితగా కూర్చగలిగితే ఆ మనిషి, విద్యావంతుడనీ, సాంస్కృతికంగా పరిణతి చెందినవాడనీ గుర్తు. తన అభిరుచి ఉన్నతమైందని తెలుపుకోడానికీ, తాను జీవించిన క్షణాలు చిరస్మరణీయాలూ, సామాజికంగా ప్రభావశీలాలూ అని చెప్పుకోడానికి ప్రతి మనిషీ ఉవ్విళ్ళూరేవాడు. ఆ ఉద్వేగంలో కవిగా మారేవాడు. అలా ఒకరికొకరు పంచుకున్న ఆ కవితలు అనతికాలంలో సాహిత్యంగా మారిపోయేవి.