ముందు మనం పాఠకులుగా మారాలి

ఇదంతా చదివిన తరువాత మీకేమనిపిస్తున్నది? మనం కవిత్వాన్ని చదవవలసినట్టుగా చదవడం లేదనే కదా. కవిత్వం చదవడానికి మనకి కావలసింది అన్నిటికన్నా ముఖ్యం కాలం. ప్రతి ఒక్క పదప్రయోగం దగ్గరా ఆగిపోగలిగే, జీవితాన్ని అంకితం చేయగలిగే మనఃస్థితి. ఇప్పుడు మనకి కావలసింది, మరింత మంది కవులు కాదు, మహాకవులు అసలే కాదు, మనకి కావలసింది పాఠకులు.

ఆషాఢమేఘం-13

నిజమైన కవిత్వానికి ఎజెండా ఉండదు. బుచ్చిబాబు చెప్పినట్టుగా అది నీకు జీవితాన్ని జీవించదగ్గదిగా మారుస్తుంది అంతే. ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు నీ ముందు సరికొత్తగా ఆవిష్కరిస్తుంది. కాని ఆ శక్తి అనన్యసామాన్యమైన శక్తి. అందుకనే పూర్వకాలంలో మతాలూ, ఇప్పటికాలంలో రాజకీయాలూ కవుల్నీ, కవిత్వాల్నీ తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే చూస్తూ వచ్చాయి.

ఆషాఢమేఘం-5

జీవితకాలం అడవుల్లో బతికినవాడికి మాత్రమే తోచగల అనుభూతి ఇది. వాన పడే మధ్యాహ్నాల్లో అడవుల అందాన్ని చూసి మనతో పంచుకున్న కవి నాకిప్పటిదాకా ప్రపంచ కవిత్వంలో మరొకరు కనబడలేదు. ఒక జూలై మధ్యాహ్నం అడ్డతీగల్లో అడవుల్లో వానపడుతున్నప్పుడు, ఈ శ్లోకమే నాకు పదే పదే గుర్తొస్తూ ఉండింది.

Exit mobile version
%%footer%%