ఆషాఢ మేఘం-18

తక్కిన కాళిదాసు రచనలన్నీ అలా అట్టేపెట్టి, మేఘసందేశంలో మాత్రం కాళిదాసు ఈ కవిత్వాలన్నిటినీ కలిపి ఒక రసమిశ్రమం రూపొందించాడు. కాబట్టి చాలాసార్లు ఆ పాఠాన్ని బోధిస్తున్న గురువులకు తెలియకపోయినా, ఆ కావ్యపాఠాన్ని వల్లెవేస్తూ ఉన్న విద్యార్థులకు తెలియకపోయినా, మేఘసందేశం ద్వారా వారు అత్యుత్తం ప్రాకృత, తమిళ భావధారలను తాము అస్వాదిస్తోనే వచ్చారు.

ఆషాఢమేఘం-11

ముల్లైప్పాట్టు ఒక సాధారణ ప్రణయ కవిత స్థాయి నుంచి ఒక శుభాకాంక్షగా మన కళ్ళముందు ఎదిగిపోతుంది. మేఘసందేశంలో కాళిదాసు ప్రణయవార్తకీ, శుభాకాంక్షకీ మధ్య సరిహద్దుని చెరిపేసాడని టాగోర్ అంటున్నప్పుడు, కాళిదాసుకన్నా ఎంతో కాలానికి పూర్వమే ఒక ప్రాచీన తమిళ కవి ఆ పని చేసాడని ఆయనకు తెలీదు!

ఆషాఢమేఘం-10

తమిళదేశాన్ని సాంస్కృతికంగా ఏకం చెయ్యడంలో సంగం కవులు, భావుకులు చూపించిన ఈ వివేకం, ఈ ప్రజ్ఞ ఎంత బలమైనవంటే, తర్వాత రోజుల్లో నాయనార్లకీ, ఆళ్వార్లకీ ఈ రసజ్ఞతనే పాదుగా నిలబడింది. ఇన్ని శతాబ్దాల తరువాత కూడా తమిళుల్ని ప్రాంతీయ భేదాలకు అతీతంగా దగ్గరగా నిలబెడుతున్న జీవజలాలు సంగం సాహిత్యం నుండి ఊటలూరినవే.

Exit mobile version
%%footer%%