గాథాసప్తశతిలో కనిపించే స్త్రీపురుషప్రేమకీ తర్వాత రోజుల్లో కావ్యప్రపంచాన్ని పరిపాలించిన ప్రేమకీ మధ్య చాలా తేడా ఉంది. ప్రాకృత కవిత్వంలో కనిపించే ప్రేమ స్త్రీపురుషుల మధ్య సహజంగా వికసించే అత్యంత లౌకిక ప్రేమ, గ్రామీణ ప్రేమ. దేహాలనూ, మనసులనూ కలిపే ప్రేమ.
ఆషాఢమేఘం-14
ఒక విమర్శకుడు రాసినట్టుగా, 473 మంది సంగం కవులున్నారంటే, 384 మంది గాహాకోశ కవులున్నారంటే, ఆ కాలాలు, ఆ సమాజాలు ఎంత రసనిష్యందితాలయి ఉండాలి!
ఆషాఢమేఘం-13
నిజమైన కవిత్వానికి ఎజెండా ఉండదు. బుచ్చిబాబు చెప్పినట్టుగా అది నీకు జీవితాన్ని జీవించదగ్గదిగా మారుస్తుంది అంతే. ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు నీ ముందు సరికొత్తగా ఆవిష్కరిస్తుంది. కాని ఆ శక్తి అనన్యసామాన్యమైన శక్తి. అందుకనే పూర్వకాలంలో మతాలూ, ఇప్పటికాలంలో రాజకీయాలూ కవుల్నీ, కవిత్వాల్నీ తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే చూస్తూ వచ్చాయి.
