తక్కిన కాళిదాసు రచనలన్నీ అలా అట్టేపెట్టి, మేఘసందేశంలో మాత్రం కాళిదాసు ఈ కవిత్వాలన్నిటినీ కలిపి ఒక రసమిశ్రమం రూపొందించాడు. కాబట్టి చాలాసార్లు ఆ పాఠాన్ని బోధిస్తున్న గురువులకు తెలియకపోయినా, ఆ కావ్యపాఠాన్ని వల్లెవేస్తూ ఉన్న విద్యార్థులకు తెలియకపోయినా, మేఘసందేశం ద్వారా వారు అత్యుత్తం ప్రాకృత, తమిళ భావధారలను తాము అస్వాదిస్తోనే వచ్చారు.
ఆషాఢ మేఘం-17
గాథాసప్తశతిలో కవయిత్రులు నన్నాపేస్తున్నారు. దాదాపు రెండువేల ఏళ్ళ కిందట కవిత్వం చెప్పిన ముగ్ధలూ, ప్రౌఢలూనూ. మమ్మల్ని నీ మిత్రులకి పరిచయం చెయ్యవా అని అడుగుతున్నారు.
ఆషాఢ మేఘం -16
గాథాసప్తశతి తెలుగువాళ్ళ ఆస్తి. ప్రతి ఒక్క తెలుగు కవీ నేర్చుకోడానికి ఇష్టం చూపించాలేగాని, కవిత్వశిల్ప రహస్యాలు చెప్పడానికి గాథాసప్తశతి కవులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
