అమృతానుభవం

అనుభవామృతాన్ని తెలుగు చేయడానికి రాధాకృష్ణమూర్తిగారికన్నా తగినవారు ఎవరుంటారు? ఉపనిషత్తులూ, భగవద్గీతలతో పాటు ఆధునిక పాశ్చాత్య చింతనని కూడా సాకల్యంగా అర్థం చేసుకుని సమన్వయించుకోగలిగిన ఆ వేదాంతి చేతులమీదుగా వెలువడటం కోసమే ఆ పుస్తకం ఇన్నాళ్ళుగా నిరీక్షిస్తూ ఉన్నదని అర్థమయింది

దశార్ణదేశపు హంసలు

'ఆ హంసలక్కడ ఉండేది కొన్నాళ్ళే'. ఈ వాక్యం చిన్నప్పణ్ణుంచి చదువుతున్నాను. కాళిదాసు ఈ మాట దశార్ణదేశపు హంసల గురించి రాసాడనే అనుకున్నాను ఇన్నాళ్ళూ. ఇప్పుడు తెలుస్తోంది, ఆ హంసలు నా ప్రాణాలేనని' అన్నారాయన తన డెబ్బై ఏళ్ళ అస్వస్థ శరీరాన్ని చూసుకుంటో.

సాహిత్య జగత్తు

ఆ వ్యాసాల్లో రవీంద్రుడు భారతీయ సహృదయ పరంపరకు ఇరవయ్యవ శతాబ్ది వారసుడిగా కనిపిస్తాడు. ఉప్పెనలాగా విరుచుకుపడ్డ పాశ్చాత్య సభ్యతను అవగాహనకు తెచ్చుకుంటూ ఆ వెలుగులో మన సాహిత్యాన్నీ, మన సాహిత్యం వెలుగులో ఆధునిక జీవితాన్నీ, ఆధునిక సందర్భంలో సాహిత్యకారుల కర్తవ్యాన్నీ తెలుసుకుంటూ చేసిన రచనలవి.

Exit mobile version
%%footer%%