మహాకవి దాశరథి కృష్ణమాచార్య కవిత్వం పైన 2007 లో మోహనరాగం సిరీసు లో చేసిన ప్రసంగం. ఇప్పుడు దాశరథి శతజయంతి సందర్భంగా మరోమారు మిత్రుల్తో పంచుకుంటున్నాను. ఆ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.
సిద్ధౌషధం
కవిగా ఆయన సర్వోన్నతుడు, కాని మనిషిగా బలహీనుడు, ఎంత మహావిషాదాన్ని చూసినా కూడా తన జీవితేచ్ఛ చల్లారని వాడు. 'పొద్దుటిపూట దీపంలాగా ఏ క్షణాన్నైయినా కొండెక్కేలాగా ఉంది' తన జీవితమని ఒక ఉత్తరంలో రాసుకున్నాడుగాని, ఆ నిశాంతవేళ కూడా సాయంసంధ్యాదీపంలాగా ప్రజ్వరిల్లాలనే తపించాడు.
మోహనరాగం: దాశరథి కవిత
'ఏను కవితన్ వరియించలేదు, తానె వరియించె కవితల రాణి నన్ను' అని గానం చేసిన దాశరథి కవిత్వాన్ని తలుచుకుంటూ 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.
