ఇప్పుడు కృష్ణా జిల్లా రచయితల సంఘంవారు 2015 సంవత్సరానికి ఆలూరి బైరాగి పురస్కారం నాకు అందించినప్పుడు మళ్ళా అట్లానే అనిపించింది. ఆ సంకల్పం లక్ష్మీప్రసాద్ గారిదో, పూర్ణచంద్, గుత్తికొండ సుబ్బారావుగార్లదో అనుకోవడం లేదు నేను.
శిలలలో మెడొనా
నిన్న సాయంకాలం ఆదిత్య మా ఆఫీసుకి వచ్చాడు. అతడు బాగులోంచి ఆగమగీతి బయటకు తీస్తుండగానే గుర్తొచ్చింది, బైరాగి (1925-79) పుట్టినరోజని. ముఫ్ఫై ఏళ్ళకిందట నేను బైరాగి కవిత్వాన్ని ఆరాధించినదానికన్నా అతడిప్పుడా కవిత్వాన్ని మరింత ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు.
